
చివరి రోజు 12 పరుగుల తేడాతో మ్యాచ్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ విరామం సమయానికి కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నింపాదిగా ఆడుతూ స్కోర్ బోర్డును 97 పరుగులకు చేర్చారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావిస్తున్న తరుణంలో… రవీంద్ర జడేజా మ్యాచ్ ను మలుపు తిప్పాడు. మరొకసారి కుక్ వికెట్ ను తన ఖాతాలో వేసుకుని 103 పరుగుల వద్ద వికెట్ల పతనాన్ని ప్రారంభించిన జడేజా, 207 పరుగుల వద్ద చివరి వికెట్ ను కూడా తీసి టీమిండియా ఘనవిజయానికి కారణమయ్యాడు. మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ముందు తొడగొట్టాడు.
దీంతో డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త భారత్ వైపుకు తిరగడంతో సిరీస్ ను 4-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ను మలుపు తిప్పిన జడేజాకు ఓ ప్రత్యేక అవార్డును బహుకరించగా, ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, సిరీస్ ఆద్యంతం తన బ్యాటింగ్ తో మంత్రముగ్ధులను చేసిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. టీమిండియా సాధించిన ఈ విజయంతో ప్రతి క్రికెట్ అభిమాని ఉత్సాహంతో ఉప్పొంగుతున్నాడు.
Inline image 1
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…