
సురేష్ రైనా సారధ్యంలో కొనసాగుతోన్న గుజరాత్ లయన్స్ జట్టులో ఇద్దరు క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని, ఇందుకు గాను ఒక్కో ఆటగాడికి దాదాపుగా 40 లక్షల రూపాయలు ముట్టినట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సదరు సమాచారాన్ని బీసీసీఐకు ఇచ్చిన పోలీసులు, క్రీడాకారుల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం ముగ్గురు బుకీలు తమ అదుపులోనే ఉన్నారని, వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు స్పష్టం చేసారు.
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ ఆటగాళ్ల పేర్లను బయటకు వెల్లడించబోమని బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకునే పాటికి వెలుగు చూసిన ఈ ఉదంతం పక్కన పెడితే, గుజరాత్ లయన్స్ జట్టు 7వ స్థానంలో నిలిచి, టోర్నీ నుండి ఇప్పటికే వైదొలగిన విషయం తెలిసిందే. అంటే గుజరాత్ 7వ స్థానానికి పడిపోవడం వెనుక ఆ ఇద్దరు క్రీడాకారుల ‘హస్తం’ ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ “ఆ ఇద్దరు” ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…