
ఇచ్చిన తీర్పుకు తమ వంతుగా ఏపీ సర్కార్ అసెంబ్లీ నియమ నిబంధనలను కోర్టు ముందుంచాలని, ముఖ్యంగా 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ నిర్ణయాలను తప్పుపట్టే అధికారం గానీ, శాసనసభ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేదని గట్టిగా చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రోసీజరల్ మిస్టేక్స్ ను ఆధారంగా చేసుకుని సభ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవని డివిజినల్ బెంచ్ కు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో ప్రభుత్వ నియమ నిబంధనలతో కోర్టు ఏకీభవిస్తే… రోజాపై ఇచ్చిన మధ్యంతర తీర్పు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందని మీడియా వర్గాల వేదికగా కధనాలు ప్రసారమవుతున్నాయి. మొత్తానికి తనకు న్యాయం జరిగింది అని సంతోషం వ్యక్తం చేసిన రోజాకు ఈ సంతోష సమయం ఎంతసేపు ఉంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…