
ఆ రకంగా బీసీ కోటాని అదే బీసీ వ్యక్తితో పూడ్చినట్టు అవుతుంది. ఈ నెల 29న రాజ్యసభకు ఎన్నికైన ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తారు. ఆ వెంటనే కొత్త వారిని జగన్ తన కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం. అయితే ఇప్పటిదాకా ఈ విషయంగా ఆయన ఎవరితోనూ చర్చించలేదని తెలుస్తుంది.
అధికారంలోకి వచ్చాకా జగన్ చేస్తున్న మొట్టమొదటి కేబినెట్ విస్తరణ ఇది. అయితే ఈ విస్తరణలో ఉద్వాసనలు ఏవీ ఉండబోవని సమాచారం. ఇప్పటికే రెండున్నర ఏళ్ళ తరువాత దాదాపుగా మొత్తం కేబినెట్ ని మార్చి వేరే వారికి అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు. కావున అప్పటివరకూ ఉద్వాసనలు ఉండవని అంటున్నారు.
ప్రస్తుతం కేబినెట్ నుండి తప్పుకునే ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇందులో పిల్లి సుభాష్ శెట్టిబలిజ కాగా, మోపిదేవి మత్సకార వర్గానికి చెందిన వారు. దీంతో వీరి స్ధానాల్లో మరో ఇద్దరు బీసీలకే చోటు కల్పించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టి బీసీల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మత్సకార సామాజికవర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. వీరితో పాటు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు నుంచి గెలిచిన మాజీ మంత్రి పార్ధసారధి పేరు కూడా వినిపిస్తోంది.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…