
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారడానికి రెండు రోజుల ముందు గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్, మీడియా ముందుకొచ్చి… నేను తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఒక్క గంటలో కూల్చగలను, 21 మంది అధికార పార్టీ నేతలు మాతో టచ్ లో ఉన్నారని, ఆ సంఖ్య మరి కొంచెం పెరిగే అవకాశం ఉందని, ఆ ‘మ్యాజిక్ ఫిగర్’కు చేరుకున్నాక ప్రభుత్వాన్ని ఒక్క గంటలో పడేస్తానని చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు తానూ చేయలేదని, ప్రభుత్వాన్ని పడగొడతానని తానూ అనలేదని ‘సో… కాల్డ్ మాట తప్పని మడమ తిప్పని నేత’ జగన్ మాట మార్చారనుకోండి… అది వేరే విషయం..!
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నానని ప్రతిపక్ష నేత అయిన జగన్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు. మరి ఆయనతో టచ్ లో ఉన్న ఆ తెలుగుదేశం నాయకులను జగన్ ఎంత మొత్తం ఇచ్చి కొనుగోలు చేసారో లేదా ఏ ప్రలోభాలను రుచి చూపించారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ ను ప్రశ్నిస్తున్నారు. మరి 21 మంది ప్రభుత్వ ఎమ్మెల్యేలను టచ్ లో ఉంచుకోవచ్చు కానీ, నలుగురు ప్రతిపక్ష నేతలకు అధికార ప్రభుత్వం ‘పసుపు’ కండువాలు కప్పకూడదా అని అధికార పార్టీ వారు తమ పనిని పూర్తిగా సమర్ధిoచుకుంటున్నారు.
ఏపీలో రాజకీయ సమీకరణల మార్పుకు కారణం ఒక రకంగా జగనే దారి చూపించారని ఆ పార్టీలో నాయకులే అంతర్గతంగా అభిప్రాయ పడుతున్నారు. జగన్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను టచ్ లో ఉంచుకొని ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం తప్పు కానప్పుడు, మరి మేము చేసింది తప్పేలా అవుతుందని పసుపు కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
A decades-old Foreign Exchange case has ended with a significant ruling for NRIs and banking…
బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో పాతాళానికి పడిపోతున్నాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా…