
“వైసీపీ ప్రారంభించినపుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు మాతో కలిసి వస్తే, వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అందరినీ గెలిపించుకున్నాం. తదనంతర ఎన్నికలలో మా బలం 67కు పెరిగింది. ప్రజల్లో వైసీపీ పట్ల మక్కువ పెరుగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ప్రజల్లో మా స్థానం మాకుంటుంది” అంటూ భవిష్యత్తులో అధికారం చేపట్టబోయేది తామే అన్న విధంగా జగన్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇపుడే చెప్పలేం. అంచనాలు వేసిన విధంగా అన్ని సార్లు అందరికీ జరగకపోవచ్చు. అయితే వర్తమాన పరిస్థితులను బట్టి భవిష్యత్తును ఒక అంచనా వేస్తారు. అందులో భాగంగానే జగన్ ఆశావహ దృక్పధంతో ప్రసంగించి ఉంటారు. అయితే రాజకీయాల్లో… వర్తమాన పరిస్థితులను ఎవరికి వారు అంచనా వేసుకుని వెల్లడించే అంశాల కంటే, విశ్లేషకులు, నిపుణులు వ్యక్తపరిచిన భావాలకే అధిక ప్రాధాన్యత దక్కుతుంది.
ఈ క్రమంలో భవిష్యత్తులో వైసీపీ బలం పెరుగుతుందనే జగన్ వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయని, దీనికి జగన్ అవలంభిస్తున్న రాజకీయ విధివిధానాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బలం పెరిగే సూచనలు పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న సంఖ్య కూడా నిలుస్తుందో లేదోనన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎటువంటి మార్పు లేకుండా ప్రస్తుత రాజకీయ విధానాలతోనే జగన్ ముందుకు సాగితే, పెరిగే మాట దేవుడెరుగు… జగన్ తన రాజకీయ జీవితాన్ని ఏ సంఖ్యతో అయితే మొదలు పెట్టారో… మళ్ళీ అక్కడికే చేరుకునే ఆవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.
A decades-old Foreign Exchange case has ended with a significant ruling for NRIs and banking…
బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో పాతాళానికి పడిపోతున్నాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా…