
పైగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. ఇంకో మూడేళ్ళు ఇదే ప్రభుత్వం ఉండటంతో సహజంగా ప్రజలు మార్పు కోరుకోరు. అయితే ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఎన్నికల పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎప్పుడో కసరత్తు మొదలుపెట్టింది.
అయితే బీజేపీ-జనసేన ల పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఈ రెండు పార్టీలకు గ్రామా స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. బీజేపీ కనీసం 2019 ఎన్నికల తరువాత ఎంతో కొంత ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే జనసేన 2019 ఎన్నికల సందర్భంగా ఎటువంటి అయోమయంలో ఉందో ఇప్పుడూ అదే అయోమయంలో ఉంది.
పార్టీని సంస్థాగతంగా నిర్మించడంలో ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు. పైగా ఈసారి సీట్ల పంపకం తకరారు కూడా ఉంటుంది. రెండేళ్లలో ప్రజలలోకి వెళ్ళింది లేదు అదే సమయంలో ఈ సారి గత ఓటమి తాలుక ఇబ్బంది కూడా ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య జనసేన ఎలా రాణిస్తుందో చూడాలి.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…