
నోట్ల రద్దుపై ప్రస్తావిస్తూ… ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తకుండా, ఆర్బీఐ గవర్నర్ ను టార్గెట్ చేసుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ‘జనసేన’ అధినేత. కర్నూలులో బాలరాజు వంటి ఎందరో వ్యక్తులు బ్యాంకుల ముందు క్యూ లైన్ లో మరణించడానికి తమ అద్భుతమైన మేధోమధనం నుంచి ఉద్భవించిన ‘డీమోనిటైజేషన్’ అని ఉర్జిత్ పటేల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 69 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మానవత్వంతో ఏ ప్రభుత్వమూ తీసుకునేందుకు సాహసించని నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుందని, సువిశాల భారతదేశంలో ‘క్యాష్ లెస్ ఎకానమీ’ ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు.
మీరు అనాలోచితంగా సూచించిన ఈ నిర్ణయం వల్ల దేశంలోని ఎన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారో తెలుసా? దేశాన్ని నాశనం చేసిన దుర్మార్గులంతా ఇంట్లో కూర్చుని డబ్బులు మార్చుకుంటుంటే… నిరుపేదలు, నిస్సహాయులు, దేశ ప్రజలు మాత్రం క్యూ లైన్లలో నిల్చున్నారని మండిపడ్డారు. మీరు నల్లధనాన్ని రద్దు చేసేశామని, దేశాన్ని అవినీతి రహితంగా మార్చేశామని సంకలు గుద్దుకుని ఎగరవచ్చని ఎద్దేవా చేసిన పవన్, వాస్తవంగా జరిగింది ఏమిటంటే… పాత విధానాలకు బదులు కొత్త విధానాలను చూపించారు, అలాగే బ్యాంకింగ్ ఉద్యోగులకు పర్సెంటేజ్ రూపంలో ఓ అవకాశం కల్పించారు… అంటూ ట్వీట్స్ చేసారు.
అయితే ఇవన్నీ పవన్ ఒక్కడే వేలెత్తి చూపినవి కావు. దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు, మరెంత మందో ఆర్ధిక నిపుణులు వ్యక్తపరిచారు. ఈ అభిప్రాయాలకు తనపై విమర్శలు వస్తాయని భావించారో ఏమో గానీ, ఈ రోజు పూర్తిగా తన అభిప్రాయాన్ని చెప్పడం కుదరలేదని మరొక ట్వీట్ చేసారు. అయితే పవన్ ఎక్కుపెట్టిన ‘బాణం’ మాత్రం గురితప్పిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వీటన్నింటికి కారణమైన ప్రధాని మోడీ పేరును ప్రస్తావించకుండా, కేవలం ఆర్బీఐ గవర్నర్ పేరును మాత్రమే ప్రస్తావించడం వెనుక కారణం… గతంలో చెప్పినట్లు… ‘వ్యక్తిగతంగా మోడీని కలిసినపుడు తనకంటూ ఓ అవకాశం ఉంచుకోవడానికి’ అని చెప్పకతప్పదు.
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…