
సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలైన నాటి నుండి జయలలిత ప్రజలకు దూరమయ్యారు. అప్పటినుండి డిసెంబర్ 5వ తేదీ వరకు జరిగిన అనేక నాటకీయ పరిణామాలు బాహ్య ప్రపంచానికి జయలలిత దర్శనం లేకుండా పోయింది. బహుశా ఇస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ వలన కాస్త ముఖకవలికకలో మార్పు సంభవించిందేమో… అందుకే ప్రజలకు అమ్మను చూపించడం లేదేమో అన్న టాక్ సర్వత్రా వినపడింది.
కానీ, నేడు పార్థీవదేహం చూస్తున్న ప్రజలకు ఒక రకంగా షాక్ తగిలింది. అంతకు ముందు ఉన్న విధంగా చక్కని ముఖవర్చస్సుతో కళకళలాడుతూ అమ్మ కనపడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 70 రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన ఒక పేషంట్ మాదిరి ఏ మాత్రం కనపడకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజాజీహాల్ లో చివరిసారిగా అమ్మను చూసేందుకు పోటేత్తుతున్న ప్రజానీకం ప్రస్తుతం ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మృతదేహమంటే నమ్మశక్యం కాని రీతిలో తమ ‘పురచ్చితలైవి’ని దర్శనం చేసుకుంటూ… అమ్మ నిద్రిస్తోందని వ్యాఖ్యానించుకుంటున్నారు.
ఏది ఏమైనా… ఒక కారణజన్మురాలు భువి నుండి దివికెగసింది… ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం..!
Did the failure of Alia Bhatt’s Alpha end up affecting other female actors too? Taapsee…
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…