
“పీకే, 3 ఇడియట్స్, మొహింజోదారో, లగే రహో మున్నాభాయ్” వంటి సినిమాలకు ఫోటోగ్రఫీ విధులను నిర్వహించిన మురళీధరన్ కు – ‘జై లవకుశ’ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలతో, అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో ఈ స్థానంలో టాలీవుడ్ ఏస్ కెమెరామెన్ చోటా కే నాయుడును తీసుకున్నారు. ఈ మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. సెట్స్ లో తలెత్తిన ఈగో వలనే ఈ మార్పు జరిగిందని ట్రేడ్ వర్గీయుల విశ్వసనీయ సమాచారం.
ఇక, ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి లేటెస్ట్ ఓ వార్త హల్చల్ చేస్తోంది. స్వతహాగా కూచిపూడి నృత్యం నేర్చుకున్న జూనియర్, ఈ సినిమాలో ఓ పాత్రలో అలాంటి నృత్య దర్శకుడి పాత్రను పోషిస్తున్నారని, నాటి కమల్ హాసన్ ‘సాగర సంగమం’ తర్వాత ఆ రేంజ్ లో ఉండే పాత్రగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఒక్క ఎన్టీఆర్ వల్లే అవుతుందనే విధంగా “జై లవకుశ” సిద్ధమవుతోందని సందడి చేస్తున్న టాక్ అభిమానులకు మాంచి ఉత్సాహాన్ని పంచుతోంది.
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…