
ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆమె ఓటమి చెందారు. గతంలో కవితకు సీటు ఇచ్చే విషయంలో కేసీఆర్ వెనుకంజ వేస్తున్నారని ప్రచారం జరిగింది. కాని కవితకు రాజ్యసభ పదవి ఇవ్వాలని కేసీఆర్ పై పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం. కవిత రాజకీయాలలో యాక్టివ్ గా ఉండడం పార్టీకు ఉపయోగమని వారు వాదిస్తున్నారు.
అందువల్ల వచ్చే రెండు సీట్లలో ఒకటి కవితకు కేటాయింవచ్చని చెబుతున్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాధం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు కూడా రేసులో ఉన్నారు. దీనితో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ కు దక్కే నాలుగు సీట్లలో ఒకటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు రాజ్యసభ సీట్లలో తమ కుటుంబసభ్యులకు పెద్దపీఠ వేసినట్టు అవుతుంది.
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…