
ఇందులో మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లు లేవు. వీరిద్దరూ లోక్ సభకు పోటీ చేసి మోడీ పేరు మీద గెలిచే అవకాశాలు ఉంటాయేమో అని ఆశ పెట్టుకున్నారట. కన్నా అయితే ఏదో విధంగా ఎంపీ అయిపోతే ఆంధ్రప్రదేశ్ కోటాలో కేంద్ర మంత్రి అయిపోవచ్చు అనే ఆశతో ఉన్నారట. కన్నా సొంత సీటు – గుంటూరు పశ్చిమ స్థానం నుంచి సినీనటి పసుపులేటి లతా మాధవికి టికెట్ ఇచ్చారు. గత సంవత్సరం బీజేపీలో చేరిన ఆమె ఎన్నికలలో పోటీ చెయ్యడం ఇదే మొదటి సారి.
ఒక వేళ అధిష్టానం కన్నా లోక్ సభకు పోటీ చెయ్యడానికి ఒప్పుకోకపోతే పెదకూరపాడు స్థానం ఖాళీగా ఉంచడంతో కన్నా అక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయి. 2014లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్రాజుకు మరోసారి టిక్కెట్ వరించింది. ఆయన మంత్రి గంట శ్రీనివాసరావును ఢీకొట్టబోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్నికల బరినుంచి తప్పుకోవడంతో కైకలూరులోనూ ఎవ్వరినీ బరిలో దించలేదు.
There is no shortage of twists and unexpected returns in Andhra Pradesh and Telangana politics.…
ఇంతకాలం కేసీఆర్ కుమార్తెగా గుర్తింపు, గౌరవం పొందిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత సొంతంగా గుర్తింపు…