
బాలీవుడ్ దంపతులు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ కు మగ బిడ్డ పుట్టిన విషయం విదితమే. ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో కరీనా ప్రసవించింది. ఈ సమాచారం అందిన కాసేపటికే కరీనా తన బిడ్డతో ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసాయి. అయితే తర్వాత తెలిసిన ట్విస్ట్ ఏమిటంటే… ఈ ఫోటోలు నిజం కాదని, ఫోటో షాప్ మాయాజాలమని కరీనకపూర్ అధికార ప్రతినిధి వాస్తవం బయటపెట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో అంతా అవాక్కయ్యారు.
ఇదిలా ఉంటే ఈ బుడ్డోడుకు పెట్టిన ‘తైమూరు’ అనే పేరు కూడా పలు విమర్శలకు దారి తీసింది. ఎందుకంటే, ఆ పేరు మంగోల్ జాతి రాజు పేరని, ఈ పేరును ఎందుకు పెట్టారనేది వారి ప్రశ్న. అంతేకాకుండా, 14వ శతాబ్దంలో తైమూరు ఢిల్లీ పైకి దండెత్తి సర్వనాశనం చేశాడట. ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు తలెత్తాయి. కాగా, ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ పేరుతో దేశ వ్యాప్తంగా మొత్తం 5,500 మంది ఓటర్లు ఉన్నారు. కేవలం, పశ్చిమబెంగాల్ లోనే 3,351 మంది ఉండగా, యూపీలో 588 , మహారాష్ట్రలో 661, బీహార్ లో 558, జార్ఖండ్ లో 282 మంది ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో ఒకట్రెండు పేర్లు ఉన్నాయని పేర్కొంది.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…