
కానీ, ‘శ్రీరామనవమి’ సందర్భంగా భద్రాచలం శ్రీరామ కల్యాణానికి విచ్చేసిన కేసీఆర్, “పోలవరం ముంపు ప్రాంతంలో భాగంగా ఉన్న ఐదు గ్రామాల విషయం ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, గ్రామాలను తిరిగి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని” స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో వివాదం మళ్ళీ రాజుకున్నట్లయ్యింది. మరి దీనికి పరిష్కారం ఏ విధంగా లభిస్తుందో గానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో అన్న చర్చలు మొదలయ్యాయి.
రాష్ట్ర విభజన వేళ, భద్రాచలానికి సమీపంలో ఉండి, పోలవరం ముంపులో కలిసిపోనున్న గ్రామాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పాలన పడకేయగా, గురువారం నాడు చంద్రబాబు పర్యటించి, అక్కడి ప్రజల్లో భయాలను తొలగించే పని చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరోసారి ముంపు గ్రామాలు తెలంగాణకు రానున్నాయని వ్యాఖ్యానించడం విశేషం.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…