
ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం, కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో కేసీఆర్ దానిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారని కృష్ణసాగర్ వివరించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మూడు కారణాలున్నాయని, ఒకటి… రాష్ట్రంలో మరో రెండేళ్లలో బీజేపీ బలపడుతుందనే భయం, రెండు… కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉండడం, మూడవది… 2018లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనుండడం, ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే ఉద్దేశంతో, కేసీఆర్ ముందస్తు ఆలోచనకు కారణమని పేర్కొన్నారు.
అయితే టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ బి.వినోద్ కుమార్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపడేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన అసలేమీ లేదని, ఇవన్నీ రాజకీయ లబ్ది కోసం పొలిటికల్ వర్గాల్లో వినిపించేవేనని తేల్చేసారు. 2019 ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చే వరకు ఎన్నికలకు వెళ్లబోరని, అయినా తెలంగాణాలో టీఆర్ఎస్ కు ఎదురుగా నిలిచే పార్టీ ఏది లేదని, ఇప్పుడే కాదు, 2019 నాటికి ప్రతిపక్షాలకు ఇంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటాయని అన్నారు.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…