
“మన సమాజంలో డ్రగ్స్ కు మించిన భయంకరమైన అంశం ‘అవినీతి’ అనేది ఒకటుందని, అన్ని ప్రభుత్వాలు కూడా సిట్ ను ఏర్పాటు చేసి ఆ అవినీతి అంతమొందిస్తాయని ఆశిస్తున్నానని, వారు చేయాలనుకుంటే చేయగలరంటూ…” తన భావాలను వ్యక్తపరిచారు. ఎన్నడూ లేని విధంగా గత నాలుగు రోజులలో ‘అవినీతి’కి సంబంధించిన అంశాలను రెండింటిని రీ ట్వీట్ చేసిన కొరటాల, తాజాగా నేరుగా అవినీతి అనేది దేశానికి పట్టిన పెనుభూతంగా అభివర్ణించారు.
తన సినిమాలను సందేశాత్మకంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తులైన కొరటాల శివ, ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో “భరత్ అనే నేను” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో పాత్ర ముఖ్యమంత్రిది కావడంతో, రియల్ గా సాధ్యం కానటువంటి అవినీతి అంతమొందించే అంశాన్ని, కనీసం రీల్ లైఫ్ లో అయినా అమలు సాధ్యమయ్యే విధంగా చూపిస్తారేమో వేచిచూడాలి. సాధారణంగా సినిమా విషయాలు తప్ప సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని కొరటాల, ఇటీవల ఎందుకు స్పందిస్తున్నారు? అన్నది ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…