
అందులో భాగంగానే పార్లమెంట్ లో ఎలాగైనా విభజన బిల్లును అడ్డుకుని తీరుతామని రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి, ఢిల్లీ వెళ్లారు లగడపాటి అండ్ కో. అయితే నాడు జరిగిన నాటకీయ పరిస్థితులలో… టెలివిజన్ లైవ్ ఆపించి, ఏపీ ఎంపీలను తంతూ కాంగ్రెస్ దారుణానికి ఒడిగట్టడంతో, అనివార్య పరిస్థితులలో నాటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ‘పెప్పర్ స్ప్రే’ను పార్లమెంట్ లో ప్రయోగించారు. ఏపీ ఎంపీలపై చేసిన భౌతిక దాడులపై ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా, లగడపాటి ప్రయోగించిన ‘పెప్పర్ స్ప్రే’పై మాత్రం ఓ కేసు నమోదైంది.
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ కేసును లగడపాటిపై నమోదు చేయగా, మంగళవారం నాడు దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది. దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసిన ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పునివ్వడం హర్షించదగ్గ విషయం. దాదాపుగా మూడేళ్ళు గడిచినప్పటికీ, నాటి ‘పెప్పర్ స్ప్రే’ సంఘటన గుర్తు చేసుకుంటే, సీమాంధ్ర వాసులు రగిలిపోవడం సహజం. ఇక, నాడు ‘పెప్పర్ స్ప్రే’ను ప్రయోగించిన లగడపాటి రాజగోపాల్, ఆ తదనంతరం రాజకీయాలకు ‘గుడ్ బై’ చెప్పిన విషయం తెలిసిందే.
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…