
ఒకసారి పప్పులో కాలేసిన లగడపాటి ఈసారి కసిగా పని చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఒకే సారి సర్వే నిర్వహించే లగడపాటి ఈ సారి రెండు పర్యాయాలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో గతంతో పోలిస్తే ఈ సారి సర్వే శాంపిల్ కూడా ఎక్కువని సమాచారం. దీనితో ఖచ్చితంగా ఈ సారి కరెక్టు ఫలితం చెప్పగలనని ఆయన ధీమాగా ఉన్నారు. ఈసారి గనుక ఆయన సర్వే తప్పితే ఇక ఆయన సర్వేలను పట్టించుకునే వారు కూడా ఉండరు.
ఇప్పటికే ఆయన తన సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపినట్టు తెలుస్తుంది. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల పోలింగ్ పూర్తి అయ్యేవరకూ సర్వేలు విడుదల చెయ్యకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ రూల్ ఉన్న సంగతి తెలిసిందే. మే 23న ఎన్నికల కౌంటింగ్ జరిపి అదే రోజు ఫలితాలు వెల్లడి చెయ్యబోతుంది ఎన్నికల సంఘం.
Chandrababu Naidu is changing how Andhra Pradesh works. He is focusing on saving government money…
In under three weeks from now, Ram Charan will be returning to the big screen…