
ఈ నేపధ్యంలో… జయలలిత మృత్యువు రహస్యాన్ని బయటపెట్టేందుకు చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా జయకు వైద్యం అందించిన లండన్ డాక్టర్ కూడా స్పష్టం చేసారు. అయితే ఈ వివరణలపై జయ మేనకోడలుతో సహా నటిమణి గౌతమీ పలు సందేహాలను వ్యక్తం చేసారు. సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితి విషమించే వరకు పరీక్షలు చేయించుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
అలాగే ముందుగా జయలలితను లండన్ తరలిస్తామన్న డాక్టర్ రిచర్డ్, తర్వాత ఎందుకు మాట మార్చారని, జయలలితను చూసేందుకు తనను అనుమతించలేదని తమిళనాడు గవర్నర్ తన ప్రెస్ నోట్ లో నాడు పేర్కొన్నారని, కానీ, గవర్నర్ ను చూసి జయ చేయి ఊపారని రిచర్డ్ ఎందుకు తప్పుదారి పట్టించారని ప్రశ్నించారు. జయకు చికిత్స చేసినందుకు గాను 5.2 కోట్ల బిల్లును జయ కుటుంబ సభ్యులు చెల్లించారని చెప్పిన వైద్యులు, సదరు బిల్లులను ఎవరు చెల్లించారో తనకు చెప్పాల్సిందిగా దీప డిమాండ్ చేసారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…