
“జూనియర్స్ కు ఏదైనా మెస్సేజ్ లాంటిది, ఇన్ఫర్మేషన్ లాంటిది ఇవ్వండి” అని మెగా హీరో అంటే… “జూనియర్స్ కు మెస్సేజ్ లాంటిది ఏం లేదండి… మీకు ఎవరిస్తారు మెస్సేజ్ లు చెప్పండి…” అంటూ ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. పరోక్షంగా అల్లు శిరీష్ ను ఉద్దేశించే ప్రిన్స్ కౌంటర్ వేసారని నెటిజన్లు అంటుండగా, నిజంగానే ఈ తరానికి ఎవరూ సందేశం ఇవ్వనవసరం లేదని, ప్రిన్స్ వ్యాఖ్యలు దానికి నిదర్శనమేనని మరికొందరు అంటున్నారు.
ఈ సందర్భంగా వివిధ సందర్భాలలో మహేష్ పై నమ్రత, త్రివిక్రమ్, పూరీ జగన్నాధ్ లు వంటి వారు చేసిన కామెంట్స్ ను గుర్తుకు తెస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబులో బాగా నచ్చేది ఏంటి అన్న ప్రశ్నకు… ఈ ముగ్గురు ఒకే విధమైన సమాధానం “సమయస్ఫూర్తి” అని చెప్పారు. బహుశా ఈ సందర్భంగా మరోసారి అందరికీ తెలిసిందేమోనని అన్న మాటలు వినపడుతున్నాయి.
A decades-old Foreign Exchange case has ended with a significant ruling for NRIs and banking…
బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో పాతాళానికి పడిపోతున్నాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా…