
సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఫైవ్ స్టార్ హోటల్స్ నో, సినీ స్టూడియోలనో నిర్మించడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా మహేష్ మాత్రం ఓ అంతర్జాతీయ స్కూల్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత గుంటూరు ఎంపీ, తన బావ గల్లా జయదేవ్ సూచనల మేరకే ఈ ప్రాజెక్ట్ ను తీసుకోవాలని ప్రిన్స్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే గుంటూరు జిల్లా, బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని విద్య, వైద్య కార్యక్రమాలపై దృష్టి సారించిన మహేష్, తాజాగా అదే జిల్లా అయిన అమరావతి వైపు మొగ్గు చూపడం విశేషం.
అధికారికంగా ఈ సమాచారం వెల్లడి కాలేదు గానీ, ట్రేడ్ వర్గాలలో మాత్రం బలంగా వినపడుతోంది. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉండడం దీనికి మరింత బలాన్నిచ్చే అంశంగా మారింది. అమరావతిలో ప్రాజెక్ట్ ల కోసం ముందుకు వస్తున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం కూడా భూములను ఉచితంగా అందిస్తుండడంతో, కేవలం నిర్మాణానికి అయ్యే ఖర్చులు భరిస్తే సరిపోతుంది గనుక ఈ ప్రాజెక్ట్ కార్యరూపం సిద్ధించుకునే అవకాశాలు ఎక్కువే అని తెలుస్తోంది గానీ, సెలబ్రిటీలపై వచ్చే వార్తలను చివరి నిముషం వరకు నమ్మలేం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…