
విశేషం ఏమిటంటే… ఈ మూడు పాటలు కూడా విదేశాల్లో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ‘స్పైడర్’ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కాగా, ‘జై లవకుశ’ షెడ్యూల్ వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీ నుండి రుమేనియాలో ‘స్పైడర్’ ఒక్క పాటను చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది, ఇక విడుదలకు అన్నీ అడ్డంకులు తొలగినట్లు అవుతుంది. ‘జై లవకుశ’కు మాత్రం రెండు పాటలు బ్యాలెన్స్ ఉండగా, ‘స్పైడర్’ కంటే ఒక వారం ముందే విడుదల కావాల్సి ఉంది.
అయితే ‘జై లవకుశ’కు రెండు పాటలు ఉన్నా, ‘స్పైడర్’ ఒక్క పాటతో సమానం అనే చెప్పవచ్చు. ‘స్పైడర్’ తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాల్సి ఉండగా, ‘జై లవకుశ’ మాత్రం తెలుగులో మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి కావడంతో, అనుకున్న సమయానికి విడుదల కావడం తధ్యం అని చెప్పవచ్చు. దీంతో దసరా పండగ సినీ ప్రేక్షకుల సరదాను తీర్చేయడం ఖాయం. మాస్ ఎంటర్టైనర్ గా ఎన్టీఆర్ వస్తుండగా, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ బాబు రానున్నాడు. మరి వీరిద్దరిలో ‘విన్నర్’ ఎవరో… ఎవరెంటారు..!?
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…