
తాజాగా మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకారం… ప్రస్తుతం రోజుకు 2000 రూపాయలుగా ఉన్న నోట్ల మార్పిడిని పూర్తిగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే నల్లకుభేరుల గుండెల్లో మరో “అణుబాంబు” పేల్చినట్లే అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్గం ద్వారా బ్యాంకు అధికారులతో నల్లకుభేరులు ఒప్పందాలు కుదుర్చుకుని పాత నోట్లతో కొత్త నోట్లను మార్చుకుంటున్నారన్న సమాచారంతో, ఈ నోట్ల మార్పిడికి ప్రభుత్వం ‘శుభంకార్డు’ వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని ప్రధాని అమలు చేయాలని చూస్తున్నారని, కుదిరితే ఈ 24వ తేదీ లోపునే ఈ మార్పిడి నిర్ణయాన్ని రద్దు చేసే అవకాశం కనపడుతోందని మీడియా వర్గాలు ఘోషిస్తున్నాయి. ఈ నిర్ణయం వెలువడితే మరోసారి దేశం అట్టుడికిపోవడం ఖాయం. అప్పుడు ఉన్న డబ్బంతా బ్యాంకు అకౌంట్ లలోనే జమ చేసి, ఆ తర్వాత డెబిట్ కార్డుల ద్వారా గానీ, విత్ డ్రాల రూపేణా గానీ బ్యాంకుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి అకౌంట్లలోకి పెద్ద మొత్తం చేరితే… ఐటీ విభాగం ఎలాగూ కాచుకుని కూర్చుంది గనుక, ఆ మొత్తంపై లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. చూడబోతుంటే… నల్లధనంపై మోడీ పెద్ద యుద్ధమే చేయబోతున్నాడని అర్ధమవుతోంది.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…