
కాపులను బీసీల్లోకి చేర్చాలని ముద్రగడ చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి లేదని, తన ఆశయాన్ని పక్కన పెట్టి, దానికి సంబంధం లేనటువంటి అంశాలతో ఆరోపణలు చేయడమనేది కేవలం సమస్యను పక్కదారి పట్టించడమేనని, అయినా చంద్రబాబుపై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శమని టిడిపి వర్గాలు సదరు ఆరోపణలను తిప్పికొడుతున్నాయి.
ముద్రగడ చేత ఈ వ్యాఖ్యలు ఎవరు చేయిస్తున్నారో తమకు తెలుసని, అవినీతి ఆరోపణలతో నిత్యం కోర్టుల చుట్టూ తిరిగేవారి పనేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబుపై ఇప్పటివరకు అనేక ఆరోపణలు వచ్చాయి గానీ, ఇలా 2 లక్షల కోట్లకు అధిపతి అని మాత్రం ఎవరూ ఆరోపించలేదు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం లక్ష కోట్ల ఆరోపణలను ఎదుర్కొన్న వైనం తెలిసిందే.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…