Telugu

జగన్ కు అంత సీన్ లేదు!

కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ ఉన్నారని వచ్చిన విమర్శలు రాజకీయ విజ్ఞులకు విదితమే. అయితే దీనిపై చాలా సార్లు ముద్రగడ ఖండించినప్పటికీ, చేస్తున్న ప్రకటనలు, కార్యాచరణ వెనుక జగన్ ఉన్నారనే విమర్శలకు తానే మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లు అవుతోంది. అయితే తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందించారు ముద్రగడ.

“తన ఉద్యమం వెనుక జగన్ వున్నారనే వార్తల్లో నిజం లేదని, ఆ ప్రచారం అంతా అవాస్తమని, నిజానికి తాను సలహాలు తీసుకునే స్థాయి జగన్ కు లేదని, ఆ హోదాలో కూడా జగన్ లేరని” కీలక వ్యాఖ్యలు చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా వివరణ ఇచ్చిన ముద్రగడ, “తన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను తానెప్పుడూ కోరలేదని, జూన్ తరువాత మలి దశ ఉద్యమం ప్రారంభమవుతుందని, బ్రిటీష్ హయాంలోనే కాపులను బీసీల్లో చేర్చాలని చెబితే, అప్పటి నుండి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చాయని” దుయ్యబట్టారు.

ADVERTISEMENT
Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

49 minutes ago

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

2 hours ago