
పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ జట్టుతో పోటీపడ్డ ముంబై, కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై పేలవమైన బ్యాటింగ్ ప్రతిభతో కేవలం 124 పరుగులను మాత్రమే నమోదు చేసి మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసింది. జట్టులో ఉన్న 11 మందిలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగులకు చేరుకోలేక పోయారంటే ముంబై జట్టు ఏ విధంగా రాణించిందో అర్ధం చేసుకోవచ్చు.
స్వల్ప లక్ష్య చేధనలో తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ జట్టు ఎలాంటి ట్విస్ట్ లకు అవకాశం ఇవ్వకుండా మురళీ విజయ్, సాహాల అర్ధ సెంచరీలతో విజయాన్ని అవలీలగా అందుకుంది. ఈ గెలుపు వలన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు పాయింట్ల పరంగా పెద్దగా లాభించింది ఏమీ లేకపోయినా, ఇప్పటికే టోర్నీ నుండి అవుటైన పంజాబ్, తనతో పాటు ముంబై ను కూడా పట్టికెళ్ళినట్లయ్యింది.
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…