
లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఢిల్లీ తరపున డీకాక్ బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడుతున్న తరుణంలో ఆ వికెట్ తీసి కృనాల్ పాండ్య మ్యాచ్ ను ముంబై వైపుకు మలుపు తిప్పాడు. డీకాక్ 28 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటైన తర్వాత ఇక ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో ఎవరూ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయారు. దీంతో 126 పరుగులకు ఢిల్లీ జట్టు ఆలౌట్ అయ్యింది. బూమ్రా 3 వికెట్లతో సత్తా చాటగా, కృనాల్ పాండ్య 2 వికెట్లు తీసాడు.
తాజా గెలుపుతో 14 పాయింట్లు సొంతం చేసుకుని మూడవ స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ముంబై టీం. ఈ ఒక్క గెలుపుతో ఐపీఎల్ టేబుల్ మొత్తం రసకందాయంలో పడింది. హైదరాబాద్ ఒక్క జట్టే ప్లే ఆఫ్స్ కు చేరుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం 5 జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది.
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…