
బహుశా ఈ విషయాలపై ఏపీ మంత్రివర్యులు నారాయణ గారికి సరైన అవగాహన లేనట్లుగా కనపడుతోంది. సీఎం చంద్రబాబుకు చిరు రాసిన లేఖను ఉదహరిస్తూ… “సీఆర్డీఏ చట్టంపై చిరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అలా ఏది పడితే అది మాట్లాడి ఓ సాధారణ వ్యక్తిలా రైతులను రెచ్చగొట్టవద్దని, పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నపుడు కొంత మందికి ఇబ్బంది కలుగడం సహజమేనని, ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని” మెగాస్టార్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
వర్ధమాన నటుడు శివాజీ మాట్లాడే తీరు కంటే దయనీయంగా చిరు ప్రసంగాలు ఉంటాయని వీరాభిమానులు బహిరంగంగా చెప్పకపోయినా, అంతర్లీనంగా అందరి మదిలో అభిప్రాయాలే ఇవి. మరి అలాంటి చిరు వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిస్తూ మంత్రి గారు బదులివ్వడం అనేది వివాదాలు లేకుండా చూసుకోవడం కోసమేనా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది…
The YSR Congress ecosystem is absolutely electrified since last night. They have been carrying this…