
అక్కినేని ఇంట పెళ్లి సందడి షురూ అంటూ సోషల్ మీడియాలో వినిపించిన వార్తలకు నాగార్జున అధికారిక ముద్ర వేశారు. అక్కినేని వారసుడు నాగ చైతన్య, నటి శోభిత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటి మీద చై కానీ శోభిత కానీ ఎప్పుడు స్పందించలేదు.
అయితే ఈ ఊహాగానాలకు తెర దింపుతూ ఈ రోజు ఉదయం 9 గంటల 42 నిముషాలకు తన కుమారుడు నాగ చైతన్యకు, శోభిత దూళిపాళ్ల కు నిచితార్థం జరిగినట్లు నాగార్జున తన X లో చై, శోభిత తో కలిసి ఉన్న పిక్ ను పోస్ట్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ వారికీ జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అంటూ శోభితను అక్కినేని కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నాం అని తన ఆశీస్సులు అందచేశారు నాగార్జున.
చై, శోభిత నిచితార్థం అన్న వార్తలతో సోషల్ మీడియా అంతటా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే కొత్త జంటకు అంతా మంచి జరగాలని, వారి జీవితం ఆనందంగా ముందు సాగాలని M 9 తరుపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
The Andhra Pradesh High Court raised serious questions over the criminal complaint filed against Pawan…
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన ఈ సమయంలో అందరూ వాటికి బదులు…