
ఏపీ కోటాలోని రాజ్యసభ సీటును తెలంగాణకు చెందిన పార్టీ నేతలకు ఇచ్చే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని ‘బాస్’ ఎప్పుడో చెప్పేసారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తమను పంపించాలని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు చేస్తున్న విజ్ఞప్తులను నారా లోకేష్ కొట్టిపడేస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఏపీ కోటా రాజ్యసభ సీటును తెలంగాణ నేతలకు కేటాయించడం కుదరదని, అసలు ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నించారు.
శుక్రవారం నుండి మూడు రోజుల పాటు తిరుపతిలో జరగనున్న టీడీపీ మహానాడు వేడుకకు హాజరయ్యేందుకు లోకేశ్ నారావారిపల్లె చేరుకోగా, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా నేటి రాత్రికి సొంతూరుకు చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా ప్రారంభం నుంచి ముగింపు దాకా పాల్గొంటారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు రాత్రి నారావారిపల్లెలో బస చేయనున్నారు.
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…