
“ఉపఎన్నిక వస్తే… రఘురామ కృష్ణం రాజు తాను ఓడిపోవడం… వైఎస్సార్ కాంగ్రెస్ ని ఓడించడం ఖాయం. టీడీపీకి ఎలానూ సీన్ లేదు. ఇక గెలిచేది జనసేన – బీజేపీ అభ్యర్ధే,” అని వారు అంటున్నారు. కొందరైతే ఇటీవలే నాగబాబు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చెయ్యను అంటున్నాడు కాబట్టి ఈ సారి పవన్ కళ్యాణ్ పోటీ చేసి పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.
అయితే రాజకీయాలు అనుకున్నంత తేలికగా ఉండవు. టీడీపీ బలహీనపడినా, జనసేన – బీజేపీ టీడీపీ కంటే మెరుగ్గా రాణించే అవకాశం లేదని అంటున్నారు నిపుణులు. అదే సమయంలో రఘురామ కృష్ణం రాజు తిరుగుబాటు బీజేపీ అండచూసుకునే… ఆయనను సస్పెండ్ కాకుండా చూసుకుంటుంది ఆ పార్టీ… ఒకవేళ ఉపఎన్నిక అనివార్యమైనా ఆ సీటు బీజేపీకి ఇవ్వాలి.
అప్పుడు ఆ పార్టీ తరపున రఘురామ కృష్ణం రాజు పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. దానితో జనసైనికుల కోరికలేమి నెరవేరే అవకాశం లేదు. అనూహ్యమైన పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే తప్ప. పవన్ కళ్యాణ్ ను చట్టసభల్లో చూడాలంటే వారు మరింత కాలం వెచ్చి చూడాల్సిందే.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…