
ప్రజల వల్లే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అటువంటి ప్రజలను ఆందోళనలతో పక్కదారి పట్టించొద్దని ఆయన పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారు. అయితే ప్రధాని ఎక్కడైకనా వెళ్ళి కేంద్రం మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసేస్తాదని చెప్తే మనం నమ్మకూడదు అన్నమాట. అయితే ఇది త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతున్న కర్ణాటకకు కూడా అప్లై అవుతాదేమో!
మరోపక్క రాష్ట్ర బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కేవలం కేంద్రం నిధులతోనే జరుగుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. దీని బట్టి వారు చెప్పేది కూడా అబద్దమే అనుకోవాలా? ఒకరికొకరు పొంతన లేని మాటలతో బీజేపీ నాయకులు అనవసరంగా అభాసుపాలు అవుతున్నారు.
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…