
అలాగే, నయీం అరాచకాలు, ఆంధ్రప్రదేశ్ లో నేతల సంబంధాలపై మంత్రి అచ్చెన్నాయుడికి తానూ తెలిపానని నట్టి కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, దీనిపై బహిరంగ చర్చకైనా, మీడియా వేదికగా చర్చకైనా తాను సిద్ధమని ప్రకటించారు. మంత్రిని కలిసి, నయీం గురించి చెప్పి హెచ్చరించానని చెప్పేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తాను మీడియాతో మాట్లాడిన తరువాత సినీ పరిశ్రమలో ఎంతో మంది నయీం బాధితులు తనతో ఫోన్ లో మాట్లాడారని అన్నారు.
అయితే, సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ… అసలు నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని, తన జీవితంలో అలాంటి వ్యక్తిని కలిసిన గుర్తు కూడా లేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్ లేదా ఇంకెవరైనా విచారణ జరిపించుకోవచ్చని సవాలు విసిరారు. నట్టి కుమార్ చెబుతున్న విషయాలు తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. నయీం ఉదంతంలో సిట్ చేస్తున్న విచారణలో మరెన్ని సంచలన విషయాలు బయట పడతాయో చూడాలి.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…