
దాదాపుగా సంవత్సరం పాటు సుప్రీంకోర్టులో నిర్విరామంగా విచారణ జరిగిన ఈ కేసు చాలా ప్రత్యేకమైనదిగా కోర్టు అభివర్ణించింది. భారతదేశ శిక్షా స్మృతిలో ఉరికి మించిన శిక్ష మరొకటి లేదు గనుక, ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్షే సరని తేల్చిచెప్పింది. దీంతో సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని నిందితుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పగా, రివ్యూ కోరినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోదని, తనిచ్చిన తీర్పును సుప్రీం మళ్ళీ సవరించుకునే పరిస్థితులు ఉండబోవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అంటే తుది తీర్పే రివ్యూలో కూడా పునరావృతం అవుతాయని అంటున్న ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, రామ్ సింగ్, తీహార్ జైల్లో మార్చి 2013లో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉరికి అర్హత సాధించిన అక్షయ్ థాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ ల కంటే అత్యంత పాశవికంగా ప్రవర్తించిన అసలు నిందితుడు నేరం చేసే సమయానికి మైనర్ కావడంతో, మూడేళ్ల శిక్షా కాలం తరువాత డిసెంబర్ 2015లో విడుదలయ్యాడు.
నిజానికి నిర్భయ తల్లితండ్రులతో పాటు అందరూ కూడా ఈ మైనర్ ను విడుదల చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే భారతీయ చట్టాల రీత్యా, సదరు నిందితుడు విజయవంతంగా బయటపడగలిగాడు. నిర్బయ కేసు జరిగిన తరువాతనే, తీవ్రమైన నేరాల విషయంలో బాల నేరస్తుల వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ కూడా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. బహుశా అతను మైనర్ కాకుండా ఈ నలుగురితో పాటు ఉరి కంభం ఎక్కే జాబితాలో ముందువరుసలో ఉండి ఉండేవాడని చెప్పడంలో సందేహం లేదు. కానీ, ప్రస్తుతానికి మాత్రం మైనర్ తప్పించుకున్నట్లే..!
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…