
కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ క్రెడిట్ కూడా ప్రతిపక్షానికి ఇచ్చే ఉద్దేశం కనపడుతున్నట్లు లేదు. అందుకనే జేసీ దివాకర్ రెడ్డి వంటి ‘స్పెషల్’ రాజకీయ నేతల నోట సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పిస్తోంది. ఆదివారం నాడు ఓ వివాహ వేడుకకు హాజరైన జేసీ, “రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో ప్రజలు సంతృప్తి కరంగా లేరని, పాలనలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో, అధికార యంత్రాంగం హైదరాబాద్ లో ఉండడం వల్లనే పాలనా గాడిలో పడలేదని, ఒక్క రాష్ట్ర ప్రభుత్వ విషయంలోనే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని” మండిపడ్డారు.
సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాల నుండి వస్తుంటాయి. అయితే ఏపీలో ఉన్న ప్రతిపక్షం స్వార్ధ రాజకీయాలకే పరిమితం కావడంతో, ప్రతిపక్ష బాధ్యతలను కూడా అధికార పక్షమే నిర్వహిస్తోందన్న చలోక్తులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ప్రజా వ్యతిరేక భావాలను కూడా అధికార పక్షమే వినిపించడం కొత్తగా ఉంది కదూ! ఇందులో దివాకర్ రెడ్డిది అందెవేసిన చేయి కాబట్టే, అయన ‘స్వరం’ ఎప్పుడు సంచలన భావాలను ప్రకటిస్తుంది. మరి ఇదంతా చూస్తూ ప్రతిపక్ష నేత జగన్ ఏం చేయాలి అనుకుంటున్నారా..! ఎలాగూ ఉందిగా జగన్ బ్రాండ్ “ఓదార్పు…”
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…