
నిధులు లేవని రైల్వే జీఎం చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీలంతా సమావేశం నుండి వాకౌట్ చేసారు. బడ్జెట్లో 20 వేల కోట్లను ఇస్తున్నట్లుగా చూపి, కేవలం 2 వేల కోట్లను కూడా కేటాయించలేదంటూ, గత బడ్జెట్ లో 25 వేల కోట్లను మంజూరు చేసినట్లుగా చెప్తే, కేవలం 250 కోట్లు మాత్రమే ఇచ్చారని, చెప్పిన మొత్తం కూడా ఇవ్వలేనపుడు ఇలాంటి సమావేశాల్లో కూడా పాల్గొని ప్రయోజనం లేదని, రైల్వే బడ్జెట్కు ముందు ఆ శాఖ మంత్రిని కలిసి తమ గోడు వెలిబుచ్చుతామని అన్నారు.
ఏపీపై రైల్వే శాఖ చూపుతున్న వివక్ష వలన నిరసనలు తెలియజేయడంలో భాగంగా బయటకు వచ్చేసామని తెలిపిన ఎంపీలు తమకు కావాల్సిన ప్రాజెక్ట్ లపై వినతి పత్రాలను అందజేశామని తెలిపారు. కేంద్రం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖపై తెలుగుదేశం ఎంపీలు పెంచిన “స్వరం” దేనికీ సంకేతాలు? అన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి.
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…