
అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు రాష్ట్రపతి భవన్ లో రేపు మధ్యాహ్నం విందు ఇస్తున్నారు. దానికి కొందరు ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది.
అయితే జగన్ ను మాత్రం పిలవలేదు. ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రులను ఎంపిక చేశారో గానీ జగన్ ని మాత్రం పిలవలేదు. ట్రంప్ పర్యటన గురించి వివరంగా ఆయనకు వడ్డించే వంటకాలతో సహా చెప్పిన సాక్షి… ఈ సంగతి మాత్రం చెప్పలేదు. అదే గాక… ట్రంప్ సతీమణి, మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారట.
అయితే ఆ పర్యటనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని గానీ మనీష్ సిసోడియాని గానీ పిలవలేదని ప్రముఖంగా ప్రచురించింది. ఇంత విస్తారంగా కవర్ చేసి జగన్ ను పిలవలేదు అనే దానిని దాచిపెట్టడంతో సాక్షి తన పక్షపాతాన్ని బయటపెట్టుకుంది అని సోషల్ మీడియాలో పలువురు ఆక్షేపిస్తున్నారు.ఎం
The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…
Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…