
నిన్న ఆయన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి పట్నంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ కరోనా సోకని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం మాత్రమే. దీనితో ఈ రెండు జిల్లాలను లాక్ చేసేశారు. వేరే జిల్లాల వారు ఇక్కడకి రావడానికి వీలు లేదు. అయితే పార్టీలోను, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డిని ఆపేదెవరు?
పైగా ఆయన ఒక్కరే కాకుండా ఆయనతో అనుచరులు, కారులు… ఆ హడావిడే ఒక రేంజ్ లో ఉంటుంది. మాస్కులు లేవు అంటేనే ఇప్పటికి ఒక డాక్టర్, ఒక మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం ఇక విజయ సాయిరెడ్డిని ఆపితే ఇంకేమైనా ఉందా? మొన్న ఆ మధ్య తెలంగాణ నుండి వచ్చిన ఆంధ్ర వారిని మూడు రోజుల పాటు సరిహద్దుల వద్ద నిలబెట్టింది ప్రభుత్వం.
నిన్నటికి నిన్న గల్ఫ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వారు 14 రోజులు అక్కడ ఐసొలేషన్ లో ఉండి వచ్చినా ఇక్కడ ఇంకో పద్నాలుగు రోజులు ప్రభుత్వ ఐసొలేషన్ వార్డులో ఉండాల్సిందే అని ప్రభుత్వం చెప్పింది. బహుశా వారు విజయసాయి రెడ్డి లాగా పరపతి కలిగినవారు కాదు అనేమో? ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 365 కేసులు నమోదు అయ్యాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…