
ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల అభిమానుల గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూడకపోతే, ‘డీజే’ సినిమాకు నెగెటివ్ ప్రచారం మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ‘డీజే’ సినిమాలోని ఓ పాటను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించడం ద్వారా పవర్ స్టార్ అభిమానులను శాంతింప చేసేందుకు అరవింద్ యత్నించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా వెబ్ ప్రపంచంలో జరుగుతున్న ఈ ఫ్యాన్స్ వార్ ను మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లి వారి సహకారాన్ని తీసుకోవాలని అరవింద్ చూస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యే నాటికి వాతావరణాన్ని అంతా కూల్ చేసి, బాక్సాఫీస్ వద్ద బన్నీకి రాజమార్గాన్ని ఏర్పాటు చేయడానికి అరవింద్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. వరుస విజయాలతో ఉన్న అల్లు అర్జున్ కెరీర్ ను “దువ్వాడ జగన్నాధమ్” ద్వారా మరో మెట్టు ఎక్కించే విధంగా చూడాలన్నదే అరవింద్ ప్రయత్నంగా తెలుస్తోంది.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…