
రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో పవన్ తో చేతులు కలుపుతామని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ అధికారికంగా వెల్లడించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని, ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని, పవన్ తో ఇప్పటికే చర్చలు జరిపామని, భవిష్యత్తులో ఆయనతో కలిసి ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.
అయితే వామపక్షాల భావజాలం ఎలా ఉన్నా, అధికారానికి మాత్రం వారు దూరం అన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి పార్టీలతో కలుపుకుని ముందుకెళితే, పవన్ కు కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. బహుశా పవన్ కు కూడా అధికారం అవసరం లేదు గనుకే, వారి వెంట నడుస్తున్నారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దీని వలన పవన్ కు చేకూరే ప్రయోజనం ఏమైనా ఉంది అంటే… సంస్థాగతంగా చాలా వీక్ గా ఉన్న ‘జనసేన’కు కొంతమేర క్యాడర్ లభించే అవకాశం ఉంది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…