
కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై జరిగిన 14 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేయబోతున్నారు. మూడు నెలల కిందట కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఈ కేసుపై ఆరా తీశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే మళ్లీ ఆందోళన చేస్తానని హెచ్చరించారు.
అయితే పవన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆయన పర్యటనకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ కేసుని సిబిఐకి అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. తమ నాయకుడి దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చిందని జనసైనికులు అంటున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కర్నూల్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ తరువాత ఒక్క రోజు బ్రేక్ తీసుకుని అమరావతి గ్రామాల పర్యటనకు వెళ్తారు. మూడు రాజధానులు వ్యతిరేకంగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటిస్తారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…