
‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో తమ మార్క్ ను ప్రజెంట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ తో ఈ సినిమా చేయబోతుందని సమాచారం. పవర్ స్టార్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన హరీష్ శంకర్, ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కిందని, దీంతో మరోసారి హరీష్ నక్కతోక తోక్కినట్లయ్యిందని సినీ వర్గాలలో హల్చల్ చేస్తున్న టాక్. ఈ సినిమా పవన్ చేస్తున్నారని చెప్పడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.
పవన్ తాము ఓ సినిమాను నిర్మిస్తున్నట్లుగా గతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగానే వెల్లడించింది. ఇది చెప్పి దాదాపుగా ఏడాది గడుస్తున్నా… మరోవైపు సదరు సంస్థ ప్రస్తుతం రామ్ చరణ్ తో “రంగస్థలం” మరియు నాగచైతన్యతో “సవ్యసాచి” సినిమాను నిర్మించే పనిలో ఉంది. అలాగే మహేష్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తోంది. టాప్ హీరోల డేట్స్ ను దక్కించుకోవడంలో విజయవంతం అయిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ తో నిర్మిస్తే, ఎన్నికల ముందు పవన్ నటించే చివరి చిత్రం ఇదే కానుంది.
Raiza Wilson is turning up the heat and serving major style inspiration in her latest…
Kamal Haasan's highly anticipated Indian 2 directed by Shankar and released in 2024, received negative…