
సదరు ఆ ట్వీట్లో అమరావతిలో రాష్ట్రప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు 200 ఎకరాలు కేటాయించింది కానీ ప్రతిష్టాత్మక ఐఐఎంకు స్థలం ఇప్పటికి కేటాయించలేదని చెప్పుకొచ్చింది. ఐఐఎం తరగతులు ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరుగుతున్నాయి అని చెప్పింది. అయితే ఇది ముమ్మాటికీ తప్పు అని తెలుస్తుంది.
దాదాపుగా మూడేళ్ళ క్రితం ఐఐఎంకు కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ భూమి పూజ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి స్థలాన్ని అప్పగించింది. కేవలం కేంద్రం నిధులు ఇవ్వక నిర్మాణం ముందుకు సాగక, ఐఐఎం తరగతులు ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరుగుతున్నాయి.
డజన్ మంది మేధావులు పక్కన ఉన్నా పవన్ కళ్యాణ్ తప్పులో కాలేసినట్టే కనిపిస్తుంది. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సినవారు ఇలాంటి తప్పులు చేస్తే అసలు దోషులు తప్పించుకుంటారు. మరోవైపు ఈ లెక్కల పై కేంద్రం విధానం ఏంటో తెలుసుకోవడానికి జనసేన కమిటీ వారు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని సమాచారం కోరారు.
Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…