
విషయానికి వస్తే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం విషయంలో కొంత గందరగోళం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. టీడీపీ బీజేపీ వాదనలలో ఏది నిజమో నిర్ధారించడానికి జేపీ, ఉండవల్లి న్యాయకత్వంలో ఒక కమిటీని వేస్తున్నట్టు ఉండవల్లి చెప్పారు. ఈ సంధర్భంగా ఇరు వైపులలో ఒకరు అబద్దం చెబుతున్నారని అది ఎవరో కనిపెట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇరువైపుల వారు వారు చెప్పే లెక్కలు తనకు పంపిస్తే నేను కమిటీకి పంపుతా అని తరువాత ఒక నిర్ణయానికి వస్తా అని దాని సారాంశం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఏ హోదాలో పవన్ కళ్యాణ్ లెక్కలు తనకు పంపమని అడుగుతున్నారు?
ప్రజాస్వామ్యంలో ఎవరైనా శ్వేతపత్రం ఇవ్వమని డిమాండ్ చెయ్యవచ్చు లేదా వ్యక్తిగతంగా కావాలంటే ఆర్టీఐ ఉండనే ఉంది. 2014లో ప్రచారం చేశా కదా అని ఒక వ్యక్తి ప్రభుత్వాలను శాసించే ప్రయత్నం చెయ్యొచ్చా? ఆయన వెనుక ఒక కులం కొంత మంది ఓటర్లు ఉన్నారనే కారణంగా ప్రభుత్వాలు దానికి ఒప్పుకోవచ్చా?
పైగా పవన్ కళ్యాణ్ దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. మాములుగా అయితే ఇలా మాట్లాడితే వారిని రాజ్యాంగేతర శక్తి అంటారు అయితే పవన్ కళ్యాణ్ ను అలా అనడానికి కొంత ఆలోచిస్తారు ఎవరైనా. కావున పవన్ కళ్యాణ్ ఇలా ప్రభుత్వాలను శాసించే పని మానేసి ఈ సమాచారమంతా ఆర్టీఐ ద్వారా తెప్పించుకుంటే అందరికి మంచిది.
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…
Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…