
యుఎస్ ప్రీమియర్స్ కు హాజరైన రామ్ చరణ్, ఈ విషయాలను స్వయంగా వెల్లడించాడు. ‘ధృవ’ సినిమా బాగా వచ్చిందని, ఇప్పటివరకు తానూ కూడా ఈ సినిమాను చూడలేదని, మీతో పాటు కలిసి చూడడానికి ఇక్కడికి వచ్చానని యుఎస్ అభిమానులతో తన అనుభూతులను పంచుకున్నారు. యుఎస్ లో ఇప్పటివరకు చెర్రీకి మార్కెట్ లేకపోవడంతో, ఎలాగైనా ‘ధృవ’ ద్వారా సొంతం చేసుకోవాలని భావించిన చెర్రీ ఎన్ఆర్ఐ ప్రేక్షకులను పలకరించాడు.
మరి ధైర్యం చేసి ఇంట్లో నుండి ఏకంగా విదేశాలకు వెళ్ళిన చరణ్ కు “ధృవ” ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇది సక్సెస్ అయితే సెంటిమెంట్ పరంగా ప్రతి సినిమాకు ఇలాగే యుఎస్ వెళ్తాడేమో! లేదంటే మరోసారి అటు వైపుగా చూడకపోవచ్చు. అయితే నటించింది రీమేక్ సినిమా కావడంతో చిత్ర యూనిట్ ‘సేఫ్ సైడ్’లో నిలిచే అవకాశాలే ఎక్కువన్నది ట్రేడ్ టాక్.
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…