
నిజానికి అప్పట్లో విజయవాడలో అసలు ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదని, విజయవాడ ప్రజల్లో ఉన్న స్పెక్యులేషన్సే వాస్తవాలన్న ఆలోచనలో వారు ఉన్నారని, తాను అవి తప్పని చెప్పడం లేదని, అవుననీ చెప్పడం లేదని, తానేం చెప్పానో సినిమాలో చూసి తెలుసుకోవాలని అన్నారు. తాను తీసిన సినిమాను చూసి పాత గాయం రేగుతుందని అనుకోవడం భ్రమ అని, ‘వంగవీటి’ సంఘటనలన్నీ రెండు కుటుంబాల మధ్య జరిగిన సంఘటనలని, ఆ రెండు కుటుంబాలకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకని ప్రశ్నించారు. వాస్తవాలను చూడడం మానేసి ఊహల్లోనే ఉండకూడదని తెలిపారు.
‘వంగవీటి’ కథను 5 భాగాలుగా తీసినా పూర్తి కాదని, ‘వంగవీటి’ లాంటి అద్భుతమైన కథతో మళ్లీ సినిమా తీయడం జరుగుతుందో, లేదోనన్న ఆలోచనతోనే రిటైర్మెంట్ ప్రకటించానని, ఈ కథలో పూర్తిగా లీనమై తీశానని, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ సినిమాను ఒక అంచనాతో చూసే వారిని తాను ఆనందింపజేయలేనని స్పష్టం చేసిన వర్మ, అలా కాకుండా తానేం చెప్పానన్న దానిని చూస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకునే అవకాశం ఉండదని చెప్పారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…