
పశ్చిమ బెంగాల్ పరిధిలోని స్టోర్లలో కస్టమర్ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు వారికి టోకెన్లు ఇచ్చి, 15వ తేదీ నాటికి సిమ్ లను అందిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సిమ్ కార్డుల కొరత అలా ఉంటే, కష్టపడి సిమ్ తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో యాక్టివేట్ కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 4జీ సిమ్ లను పొందిన లక్షలాది మంది ఔత్సాహికులు, వాటిని యాక్టివేట్ చేయించుకునేందుకు ఒక్కసారిగా వెల్లువెత్తడంతో డిజిటల్ వెరిఫికేషన్ నెట్ వర్క్ సైతం స్తంభించిపోయినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో జియో సిమ్ ను 300 నుంచి 1000కి విక్రయిస్తున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ సిమ్ ల కొరత కనిపిస్తోంది. ఓ టెల్కో సంస్థ మెగాబైట్ డేటాను 20 నుంచి 21 పైసలకు విక్రయిస్తేనే లాభం లేకుండా కనీస ఆదాయాన్ని పొందుతుంది. ఈ నేపథ్యంలో జియో ప్రస్తుత ధరవిధానంలో 1 ఎంబీ 11 నుంచి 12 పైసలకే లభిస్తుండగా, తరంగాల వేలం నిమిత్తం పెట్టిన పెట్టుబడి సంస్థకు ఆదాయ రూపంలో ఎలా వస్తుందన్నది ఇప్పటికీ జవాబులేని ప్రశ్నగా మారింది.
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…
The box office results have become very unpredictable. Amid this, the situation of every big…