
ఇందులో భాగంగానే తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం) ఓ బంపర్ ప్లాన్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. కేవలం 149 రూపాయల రీ చార్జ్ తో అపరిమిత కాలింగ్ సదుపాయాలను కల్పిస్తూ సరికొత్త ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాదు, ఈ రీ చార్జ్ తో 300 ఎంబి డేటాను కూడా అందించనుంది. ఒక విధంగా ‘వెల్కం ఆఫర్’ ముగిసిన తర్వాత జియో కూడా దాదాపు ఇదే రకమైన ప్లాన్ తో ముందుకు రానుందన్న సంకేతాలు వ్యక్తమైన నేపధ్యంలో… జియో ప్రకటనకు ముందే ‘ఆర్ కాం’ అధికారిక ప్రకటన విడుదల చేసేసింది.
అందులోనూ జియోతో పోలిస్తే… ఆర్ కాంకు కలిసి వచ్చే విషయం ఏమిటంటే… ఎలాంటి మొబైల్ లో అయినా ఆర్ కాం సిమ్ పని చేయనుంది. జియో అనేది ‘వోల్ట్’ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మొబైల్ లోనే పనిచేయనుందన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రకంగా మార్కెట్ ను ఆక్రమించుకునేందుకు 2జీ, 3జీ, 4జీ… ఇలా ఏ రకమైన మొబైల్ లో అయినా ఆర్ కాం సిమ్ పనిచేయనుందన్న ప్రమోషన్స్ చేయనుంది. అయితే ఈ సంస్థలన్నీ ఈ సరికొత్త ప్లాన్స్ ను తీసుకురావడానికి గల కారణం మాత్రం ‘జియో’నే అని చెప్పాలి. ఒక విధంగా ‘జియో’ ఎంట్రీతో మొబైల్ వినియోగదారులు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు.
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…
వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…