
ఇదే సమయంలో రోజాకు సుప్రీంకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. అసెంబ్లీలోని వైకాపా కార్యాలయానికి రోజాను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ క్లయింట్ రోజా, స్పీకర్ ను ఉద్దేశించి క్షమాపణ లేఖ రాశారని చెబుతూ, న్యాయవాది ఇందిరా జైసింగ్ లేఖ ప్రతిని న్యాయమూర్తికి అందించారు. ఇదే లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పీకరుకు సూచించిన న్యాయస్థానం, ఈ సమస్యను మరింతగా లాగవద్దని కోరింది. కేసు తదుపరి విచారణను ఆగష్టు మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. మొత్తానికి రోజా వెనక్కి తగ్గడం వలన అసెంబ్లీ దిశగా ఆమె పయనించడానికి ఒక అడుగు ముందుకు పడింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…