
ప్రత్యేక హోదా సమయంలో దీక్షలు చేసినవారు, ఆమరణ దీక్షలు చేస్తామని చెప్పినవారు అంతా ఇకనైనా బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో కొట్టాడితే ఫలితముంటుంది. చలాసాని శ్రీనివాస్ వంటి వారు ఇటీవల ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియజేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. విభజనపై చర్చ సమయంలో కాలు దువ్వినట్లుగా కనిపించిన కొందరు పెద్దలంతా ఇప్పుడు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. అసలు ఎక్కడున్నారో తెలియని మెగా హీరోలు మరికొందరు. చివరి బంతికి సిక్సర్లు కొడతామన్న పెద్ద మనుషులు అసలు ప్రేక్షకుల గ్యాలరీ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు.
రాష్ట్రాన్ని విడగొట్టి ఒకటిన్నర సంవత్సరాలైనా వీరందరికీ ఇంకా టైం వచ్చినట్లుగా లేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడకు వెళ్లి ఆందోళన చేసే ధైర్యమే వీరికి లేదా? సరే, అంత దమ్ము లేదనుకుంటే కనీసం నీతి ఆయోగ్ నైనా నిద్ర లేపొచ్చు కదా. నీతి ఆయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అంశం ఉందని కేంద్రం చెప్తున్నప్పుడు ఆ నీతి ఆయోగ్ ను సమైక్య సింహాలు, మేధావులు నిలదీయొచ్చు కదా. పోనీ మన మేధావులను వదిలేద్దాం…. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో చొక్కాలు చించుకుంటాం అని చెప్పిన పెద్ద పార్టీల పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు.
సొంత గొడవలను పరిష్కరించుకోవాడానికి పార్లమెంటుకు అడ్డం పడుతున్నారు. మాపైనే కేసులు పెడతారా? నేనెవరి కోడలినో తెలుసా? అని ఒకరు… ఏయ్.. మా తాత ఎవరనుకున్నావ్? అంటూ ఇంకొకరు తొడలు కొడుతూ పార్లమెంటులో సొంత సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఇక ప్రత్యేక హోదా ఎవరికి పడుతుంది.. బడ్జెట్ కసరత్తులు మొదలవుతున్న తరుణంలో కేంద్రం, నీతి ఆయోగ్ మరో మూణ్నాలుగు నెలలు ఆ వంకతో తప్పించుకోవడం ఖాయంగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…
Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…